హైదరాబాద్, ఆట ప్రతినిధి: గూంచా ఏస్టేట్స్ ఆధ్వర్యంలో జరిగిన ప్రతిష్ఠాత్మక జవహర్లాల్ నెహ్రూ 57వ జాతీయ సీనియర్ హాకీ టోర్నీలో ఇండియన్ ఆయిల్ జట్టు విజేతగా నిలిచింది. మంగళవారం ఆఖరి వరకు ఆసక్తికరంగా సాగిన ఫైనల్లో ఇండియన్ ఆయిల్ 6-4(పెనాల్టీ షూటౌట్) తేడాతో ఇండియన్ రైల్వేస్పై అద్భుత విజయం సాధించింది. నిర్ణీత సమయంలో ఇరు జట్ల స్కోర్లు 2-2తో సమం కావడంతో విజేతను నిర్ణయించేందుకు పెనాల్టీ షూటౌట్ నిర్వహించారు. ఇందులో ఇండియన్ ఆయిల్ తరఫున అంగద్బీర్సింగ్, తల్విందర్సింగ్, రహీల్, విక్రమ్జిత్ గోల్స్ చేశారు. అంతుకుముందు ప్రధాన మ్యాచ్లో అంగద్బీర్సింగ్(12ని, అర్మాన్ ఖురేషి(32ని) గోల్స్ కొట్టారు. నెహ్రూ కప్ గెలువడం ఇండియన్ ఆయిల్ జట్టుకు ఇది ఆరోసారి కావడం విశేషం. ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్రెడ్డి విజేతకు ట్రోఫీ ప్రదానం చేశారు.