ఆర్హుస్: భారత పురుషుల బ్యాడ్మింటన్ జట్టు థామస్కప్ టోర్నీలో శుభారంభం చేసింది. ఆదివారం అర్ధరాత్రి దాటాక ముగిసిన పోరులో భారత్ 5-0తో నెదర్లాండ్స్పై నెగ్గింది. గ్రూప్-సి ‘టై’ సింగిల్స్లో కిడాంబి శ్రీకాంత్, సాయిప్రణీత్, సమీర్ వర్మ విజయాలు సాధించగా.. డబుల్స్లో సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి, అర్జున్-ధ్రువ్ జోడీ గెలుపొందాయి. తొలి పోరులో శ్రీకాంత్ 21-12, 21-14,తో క్వీకెల్పై నెగ్గగా.. ఆ తర్వాత డబుల్స్లో సాత్విక్-చిరాగ్ జంట 21-19, 21-12తో రుబెన్-వాన్ డెర్ ద్వయంపై, సింగిల్స్లో సాయిప్రణీత్ 21-4, 21-12తో రాబిన్పై, డబుల్స్లో అర్జున్-ధ్రువ్ జోడీ 21-12, 21-13తో ఆండీ-బ్రియాన్ జంటపై, సింగిల్స్పై సమీర్ వర్మ 21-6, 21-11తో గిజాస్పై గెలిచారు. ఐదు మ్యాచ్ల్లోనూ భారత్ ఒక్క గేమ్ కూడా కోల్పోకుండా గెలువడం విశేషం.