బళ్లారి(కర్ణాటక): ప్రతిష్ఠాత్మక ఆసియా గేమ్స్లో పతకాలే లక్ష్యంగా భారత పురుషుల, మహిళల కబడ్డీ జట్లు పక్కా ప్రణాళికతో సిద్ధమవుతున్నాయి. జపాన్ వేదికగా ఈ ఏడాది ఆఖర్లో జరుగనున్న ఆసియా గేమ్స్ను దృష్టిలో పెట్టుకుని భారత కబడ్డీ జట్టు బళ్లారిలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన క్యాంప్లో శిక్షణ పొందుతున్నాయి. ఈనెల 27 నుంచి మొదలై ఏప్రిల్ 2వ తేదీ వరకు జరిగే ఈ శిక్షణాశిబిరంలో స్టార్ కబడ్డీ ప్లేయర్లు నవీన్కుమార్, పవన్ సెహ్రావత్, అర్జున్ దేశ్వాల్, సోనాలీ విష్ణు షింగటే ట్రైనింగ్ తీసుకుంటున్నారు. హై ఫెర్ఫార్మెన్స్ స్ట్రెంథ్ అండ్ కండీషనింగ్ క్యాంప్లో ప్లేయర్ల ఫిట్నెస్తో పాటు మెళకువలపై దృష్టి సారించనున్నారు.
ఉత్తమ ప్లేయర్లుగా హార్దిక్, నవనీత్
న్యూఢిల్లీ: తమ అద్భుత ప్రదర్శనతో దేశానికి చిరస్మరణీయ విజయాలందించిన హార్దిక్ సింగ్, నవనీత్కౌర్ ప్రతిభకు తగిన గుర్తింపు లభించింది. శుక్రవారం హాకీ ఇండియా(హెచ్ఐ) అవార్డుల కార్యక్రమంలో హార్దిక్సింగ్తో పాటు నవనీత్కౌర్కు ‘ప్లేయర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డులు దక్కాయి. మాస్కో ఒలింపిక్స్లో పసిడి పతకం గెలిచిన భారత జట్టులో సభ్యుడైన జాఫర్ ఇక్బాల్కు ‘ధ్యాన్చంద్ లైఫ్టైమ్ అచీవ్మెంట్’ అవార్డు లభించింది.