శాన్ఫ్రాన్సిస్కో: మెల్ట్వాటర్ చాంపియన్స్ టూర్ చెస్ టోర్నీలో భారత గ్రాండ్మాస్టర్లు అర్జున్ ఇరిగేసి, ఆర్ ప్రజ్ఞానంద తొలి రౌండ్లో ఓటమి చవిచూశారు. 17 ఏండ్ల ప్రజ్ఞానంద 1.5-2.5తో అజర్బైజాన్కు చెందిన షక్రియార్ మమెద్యరోవ్ చేతిలో ఓడిపోగా, అర్జున్ 0.5-2.5 తేడాతో జాన్ క్రిస్టాఫ్పై పరాజయం ఎదుర్కొన్నాడు. ఇతర గేమ్లలో ప్రపంచ నంబర్వన్ మాగ్నస్ కార్ల్సన్ 2.5-1.5తో అమెరికా ఆటగాడు వెస్లీ సోపై, డచ్ గ్రాండ్మాస్టర్ అనీష్ గిరి 3.5-2.5తో వియత్నాంకు చెందిన లీమ్ క్వాంగ్పై విజయం సాధించారు. తదుపరి రౌండ్లో అర్జున్ టాప్ర్యాంకర్ కార్ల్సన్ను ఎదుర్కొంటాడు.