న్యూఢిల్లీ: భారత గ్రాండ్మాస్టర్ ఇరిగేసి అర్జున్ పోర్చుగల్ చెస్ టోర్నీలో విజేతగా నిలిచాడు. నిర్ణీత 9 రౌండ్లు ముగిసేసరికి అర్జున్ 8.5 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. 140 మంది ఆటగాళ్లు పాల్గొన్న ఈ టోర్నీలో 8 రౌండ్లలో విజయాలు సాధించిన పదిహేడేండ్ల అర్జున్.. ఓ ‘డ్రా’ నమోదు చేసుకున్నాడు. భారత్కే చెందిన గుకేశ్ రెండో స్థానంలో నిలిచాడు.