లండన్ : కామన్వెల్త్ ఫెన్సింగ్ చాంపియన్షిప్లో భారత ఫెన్సర్ భవానీ దేవి సీనియర్ మహిళల సాబ్రె విభాగంలో వ్యక్తిగత స్వర్ణం దక్కించుకుంది. మంగళవారం ముగిసిన ఈ చాంపియన్షిప్లో 42వ ర్యాంకర్ భవాని ఆస్ట్రేలియాకు చెందిన వెరోనిక వాసిలెవాను 15-10 తేడాతో ఓడించింది. దీంతో భవానీ దేవి వరుసగా రెండోసారి కామన్వెల్త్ స్వర్ణాన్ని దక్కించుకున్నట్టయింది. ఇప్పటికే ఒలింపిక్స్కు అర్హత సాధించిన భవాని ఈ ఏడాది పాల్గొన్న పదో అంతర్జాతీయ టోర్నీ ఇది.