ముంబై : ఇండియన్ క్రికెట్ దిగ్గజం సచిన్ రమేశ్ టెండూల్కర్ నేడు(సోమవారం) 50వ పడిలోకి ప్రవేశించనున్నాడు. క్రికెట్ అభిమానుల్లో సచిన్ అంటే తెలియని వారుండరంటే అతిశయోక్తి కాదు. పలు రికార్డులను తన పేరిట లిఖించుకున్న సచిన్ అభిమానులకు ఆరాధ్య దైవం.
క్రికెట్ దేవుడు అని పిలుచుకునే సచిన్ టెస్టులలో అత్యధిక పరుగులు, అత్యధిక సెంచరీలు తన పేరిట రాసుకున్నాడు. సొగసైన స్ట్రెయిట్ డ్రైవ్ అతని సొంతం. ఎంతటి భీకరమైన బౌలరైనా సచిన్కు బౌలింగ్ చేయాలంటే ఒళ్లు దగ్గరపెట్టుకోవాల్సిందే. క్రికెట్కే వన్నె తెచ్చిన ఆటగాడు సచిన్. రెండు దశాబ్దాలకు పైగా అభిమానులను అలరించి, బౌలర్లను భయపెట్టిన సచిన్ … ఆటకు వీడ్కోలు పలికి దశాబ్దం దాటినా ఆటపట్ల అతనికున్న ఆరాధన ఇప్పటికీ తగ్గలేదు. సాహో సచిన్.