జకార్తా: చిరకాల ప్రత్యర్థులు మరోసారి తలపడనున్నారు. ఇండోనేషియా వేదికగా సోమవారం నుంచి ప్రారంభం కానున్న హాకీ ఆసియా కప్ తొలి పోరులో పాకిస్థాన్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. బిరేంద్ర లక్రా సారథ్యంలో యువ ఆటగాళ్లతో నిండిన భారత జట్టు డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగుతున్నది. బర్మింగ్హామ్ కామన్వెల్త్ క్రీడలకు సన్నాహకంగా భావిస్తున్న ఈ టోర్నీలో కొత్త కుర్రాళ్లు ఒత్తిడిని ఎలా అధిగమిస్తారనేది కీలకంగా మారింది. టోక్యో ఒలింపిక్స్లో కాంస్యం సాధించిన అనంతరం జట్టుపై అంచనాలు భారీగా పెరిగిపోగా.. వాటిని అందుకునేందుకు ప్లేయర్లు చెమటోడుస్తున్నారు. భారత్, పాక్ మూడేసి సార్లు కప్ సొంతం చేసుకోగా.. నాలుగోసారి టైటిల్ పట్టేందుకు తహతహలాడుతున్నాయి. ఈ మ్యాచ్ అనంతరం మంగళవారం జపాన్తో, గురువారం ఇండోనేషియాతో భారత్ తలపడనుంది.