IND vs SA | భారత్, సౌతాఫ్రికా మధ్య జరుగుతున్న మూడో టెస్ట్లో భాగంగా మొదటి రోజు ఆట ముగిసింది. భారత్ ఫస్ట్ ఇన్నింగ్స్లో భాగంగా 223 పరుగులు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్కు దిగిన సౌతాఫ్రికా 8 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 17 పరుగులు చేసింది. సౌతాఫ్రికా ఓపెనర్లు ఎల్గర్ 16 బంతుల్లో 3 పరుగులు చేసి బుమ్రా బౌలింగ్లో పుజారాకు క్యాచ్ ఇచ్చాడు. ప్రస్తుతం క్రీజులో మార్క్రమ్, కేశవ్ మహారాజ్ ఉన్నారు. మార్క్రమ్ 20 బంతుల్లో 8 పరుగులు, కేశవ్ మహారాజ్ 12 బంతుల్లో 6 పరుగులు చేశాడు.