BAN vs IND : రెండో టెస్టులో భారత బౌలర్లు వరుసగా వికెట్లు తీస్తున్నారు. దాంతో బంగ్లాదేశ్ ఐదు వికెట్లు కోల్పోయింది. దూకుడుగా ఆడి భారత్ మీద ఒత్తిడి పెంచుదామనుకున్న లిట్టన్ దాస్ను అశ్విన్ పెవిలియన్కు పంపాడు. లిట్టన్ 26 బంతుల్లో 25 రన్స్ చేశాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా మహినుల్ హక్ అర్థ సెంచరీతో జట్టును ఆదుకున్నాడు. మహినుల్ హక్ (65), మెహిదీ హసన్ మిరాజ్(10) క్రీజులో ఉన్నారు. లంచ్ తర్వాత తొలి బంతికే ఉమేశ్ యాదవ్ బంగ్లా కెప్టెన్ షకిబుల్ హసన్ను (16) వెనక్కి పంపాడు. ఆ తర్వాత ఉనద్కత్ సీనియర్ బ్యాటర్ ముష్ఫికర్ (26)ను అవుట్ చేసి భారత్కు బ్రేక్ ఇచ్చాడు. ప్రస్తుతం మెహిదీ హసన్ మిరాజ్ 15, మహినుల్ 81 పరుగులతో క్రీజులో ఉన్నారు.
టీ బ్రేక్ సమయానికి బంగ్లాదేశ్ ఐదు వికెట్ల నష్టానికి 184 రన్స్ చేసింది. షకిబుల్ హసన్. మొదటి టెస్టులో సెంచరీ చేసిన జకిర్ హసన్ (15 రన్స్ )విఫలమయ్యాడు. అతడు ఉనద్కత్ బౌలింగ్లో రాహుల్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఈ మ్యాచ్లో అవకాశం దక్కించుకున్న ఉనద్కత్ కీలకమైన జకిర్, ముష్ఫికర్ వికెట్లు పడగొట్టాడు. తొలి టెస్టులో నెగ్గిన టీమిండియా ఈ టెస్టులో కూడా గెలిచి క్వీన్స్వీప్ చేయాలనుకుంటోంది.