మెల్బోర్న్: బాక్సింగ్ డే టెస్టులో చివరి రోజు ఆట కొనసాగుతున్నది. భారత్ ముందు 340 పరుగుల భారీ లక్ష్యాన్ని ఆతిథ్య జట్టు (IND vs AUS) ఉంచింది. దీంతో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన రోహిత్, జైస్వాల్ జోడీ ఆచి తూచి బ్యాటింగ్ చేస్తున్నారు. 228/9తో ఐదో రోజు బ్యాటింగ్కు వచ్చిన ఆసీస్ బ్యాటర్లు నాథన్ లైయన్, స్కాట్ బోలాండ్ మరో ఆరు పరుగులు మాత్రమే జోడించారు. రెండో ఓవర్లోనే లయన్ను స్టార్ పేసర్ బుమ్రా బౌల్డ్ చేశాడు. దీంతో ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్కు 234 రన్స్ వద్ద తెరపడింది. దీంతో బుమ్రా ఐదో వికెట్ను తన ఖాతాలో వేసుకున్నాడు.
అనంతరం భారీ లక్ష్యాన్ని చేధించేందుకు బ్యాటింగ్ ప్రారంభించిన భారత్.. నెమ్మదిగా కొనసాగుతున్నది. ఆసీస్ బౌలర్లను ఆచితూచి ఆడుతున్న ఓపెనర్లు సింగిల్స్ తీస్తూ స్కోర్ బోర్డుకు ఒక్కోపరుగు జోడిస్తున్నారు. 16 ఓవర్లు ముగిసే సరికి 25 పరుగులు మాత్రమే చేసింది. ప్రస్తుతం రోహిత్ శర్మ 9, జైస్వాల్ 12 రన్స్తో క్రీజులో ఉన్నారు. భారత్ గెలవాలంటే మరో 315 పరుగులు చేయాల్సి ఉంది.