న్యూఢిల్లీ : ప్రతిష్టాత్మక బిల్లీజీన్ కింగ్ కప్ ఆసియా/ఓషియానా గ్రూపు-1లో భారత్ అదరగొట్టింది. థాయ్లాండ్తో తొలి పోరులో 1-2 వెనుకంజలో నిలిచిన భారత్.. న్యూజిలాండ్తో మ్యాచ్లో అద్భుత ప్రదర్శనతో సత్తాచాటింది. బుధవారం జరిగిన రెండో పోరులో భారత మహిళల జట్టు 3-0తో న్యూజిలాండ్పై స్వీప్ చేసింది. థాయ్లాండ్తో మ్యాచ్లో తడబడ్డ యువ ప్లేయర్లు వైష్ణవి అద్కార్, సహజ యమ్లపల్లి పుంజుకుని ప్రత్యర్థిపై ప్రతాపం చూపించారు.
తొలుత జరిగిన సింగిల్స్లో వైష్ణవి 6-2, 6-4తో ఐషి దాస్పై అలవోక విజయం సాధించింది. గంటన్నర పాటు సాగిన పోరులో వైష్ణవి సాధికారిక ఆటతీరుతో ఆకట్టుకుంది. గత మ్యాచ్లో తప్పులను సరిదిద్దుకుంటూ వైష్ణవి మెరుగ్గా రాణించింది. మరో సింగిల్స్లో తెలంగాణ యువ ప్లేయర్ సహజ యమలపల్లి 6-1, 6-3తో వాలెంటీనా ఇవనోవ్పై భారత్ ఆధిక్యాన్ని 2-0కు పెంచింది. తన అనుభవాన్ని ఉపయోగిస్తూ సహజ వరుస సెట్లలో ప్రత్యర్థిని చిత్తుచేసింది. అదే దూకుడు కొనసాగిస్తూ భారత ద్వయం రుతుజా బోస్లే, అంకితారైనా 6-4, 6-2తో కివీస్ జోడీ ఎరిన్ రౌట్లిఫ్, మోనిక్ బారీపై గెలిచింది.