చెన్నై: బంగ్లాదేశ్తో జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్లో భారత్(Ind Vs Ban) తడబడుతోంది. మొదటి రోజు టీ బ్రేక్ సమయానికి ఇండియా ఆరు వికెట్లు కోల్పోయి 176 రన్స్ చేసింది. ఓపెన్ యశస్వి జైస్వాల్ 56 రన్స్ చేసి ఔటయ్యాడు. రిషబ్ పంత్ 52 బంతుల్లో 39 రన్స్ స్కోర్ చేశాడు. తొలి సెషన్లో మూడు వికెట్లు కోల్పోయి తరహాలోనే.. లంచ్ బ్రేక్ తర్వాత కూడా భారత్ కీలకమైన మూడు వికెట్లును చేజార్చుకున్నది. రవీంద్ర జడేజా, అశ్విన్ ప్రస్తుతం క్రీజ్లో ఉన్నారు.
Tea on Day 1 of the 1st Test#TeamIndia 176/6
Scorecard – https://t.co/fvVPdgXtmj… #INDvBAN @IDFCFIRSTBank pic.twitter.com/iNGjIgWQdO
— BCCI (@BCCI) September 19, 2024
బంగ్లా పేస్ బౌలర్ హసన్ నాలుగు వికెట్లు తీసుకున్నాడు. తొలి సెషన్లో కోహ్లీ, రోహిత్, గిల్ వికెట్లు తీసిన అతను.. లంచ్ బ్రేక్ తర్వాత పంత్ను ఔట్ చేశాడు. నహిద్ రానా, మెహిదీ హసన్ మీర్జాలు కూడా చెరో ఒక వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.