కాండీ : ఆసియాకప్-2023లో దాయాదుల పోరుకు సమయం ఆసన్నమైంది. శనివారం కాండీ వేదికగా భారత్-పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం ఇరు దేశాల క్రికెట్ అభిమానులు అతృతగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటివరకు ఆసియాకప్లో పాకిస్తాన్పై భారత్దే పైచేయిగా ఉంది. మరోసారి చిరకాల ప్రత్యర్థిపై అధిపత్యం చెలాయించాలని టీమిండియా భావిస్తున్నది. ఈ హైవోల్టేజ్ మ్యాచ్కు భారత్ అన్ని విధాల సిద్దమైంది.
పాక్తో పోరుకు భారత ప్లేయింగ్ ఎలెవన్ను కూడా జట్టు మేనేజ్మెంట్ ఖారారు చేసింది. హైదరాబాదీ తిలక్ వర్మ ఈ మ్యాచ్తో వన్డేల్లో అరంగేట్రం చేయనున్నట్లు సమాచారం. తుది ఎలెవన్లో సూర్యకుమార్ యాదవ్ స్ధానంలో తిలక్కు చోటు కల్పించినట్లు తెలుస్తున్నది. టీ20ల్లో నంబర్ వన్ బ్యాటర్గా ఉన్న సూర్యకుమార్.. వన్డేల్లో మాత్రం తేలిపోతున్నాడు. దాంతో తొలి మ్యాచ్లో అతడిని బెంచ్కే పరిమితం చేసినట్లు సమాచారం.
ఇదిలావుంటే వెస్టిండీస్తో టీ20 మ్యాచ్ ద్వారా తిలక్ వర్మ అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. ఆరంగేట్రంలోనే అద్భుతమైన ప్రదర్శనతో అకట్టుకున్నాడు. అదే విధంగా పాకిస్తాన్తో మ్యాచ్కు కేఎల్ రాహుల్ దూరం కావడంతో వికెట్ కీపింగ్ బాధ్యతలను ఇషాన్ కిషన్ మోయనున్నాడు. ఇక రోహిత్కు జోడీగా కిషన్ను ఓపెనర్గా పంపి, గిల్ను ఫస్ట్ డౌన్లో బ్యాటింగ్కు పంపే సూచనలు కనిపిస్తున్నాయి.