చెన్నై: స్వదేశంలో జరుగుతున్న స్కాష్ ప్రపంచకప్లో భారత్ సెమీఫైనల్లో పరాజయం పాలైంది. శుక్రవారం జరిగిన సెమీస్లో భారత్ 0-3తో మలేషియా చేతిలో ఓడింది. స్టార్ ప్లేయర్ జోష్న చినప్ప 3-7, 3-7, 7-5, 4-7తో ఐరా అజ్మాన్ చేతిలో ఓడగా.. అభయ్ సింగ్, సౌరవ్ ఘోషల్ కూడా ప్రభావం చూపలేకపోయారు.
తొలి రెండు గేమ్లు కోల్పోయిన అనంతరం తేరుకొని ఓ గేమ్ నెగ్గిన జోష్న అదే జోరు కొనసాగించలేకపోయింది. మరో సెమీస్లో ఈజిప్ట్ 4-0తో జపాన్ను చిత్తుచేసింది.