IND vs BAN : తొలి టెస్టుపై టీమిండియా పట్టు సాధించింది. మూడో రోజు తొలి సెషన్లోనే భారత బౌలర్లు బంగ్లాదేశ్ చివరి రెండు వికెట్లు పడగొట్టారు. దాంతో మొదటి ఇన్నింగ్స్లో 221 పరుగుల అధిక్యం లభించింది. రెండో ఇన్నింగ్స్లో శుభ్మన్ గిల్ (110), వైస్ కెప్టెన్ పూజారా (102) సెంచరీలతో కదం తొక్కారు. దాంతో 258 రన్స్ వద్ద కేఎల్ రాహుల్ భారత ఇన్నింగ్స్ను డిక్లేర్ చేశాడు. బంగ్లాదేశ్ ముందు 513 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. బంగ్లా ఓపెనర్లు నజ్ముల్ హుస్సేన్ శాంటో (25), జకిర్ హసన్ (17) వికెట్ పడకుండా జాగ్రత్తపడ్డారు. ఆట ముగిసే సమయానికి వీళ్లిద్దరూ 42 పరుగులు జోడించారు. బంగ్లాదేశ్ విజయం సాధించాలంటే 471 పరుగులు చేయాలి. మరో రెండు రోజుల ఆట మిగిలి ఉంది. అయితే.. భారత బౌలర్ల ధాటికి తట్టుకుంటారా? అనేది వేచి చూడాలి. తొలి ఇన్నింగ్స్లో పేసర్ సిరాజ్3 వికెట్లు, కుల్దీప్ యాదవ్ 5 వికెట్లు తీసి బంగ్లాను దెబ్బకొట్టారు. ఉమేశ్ యాదవ్, అక్షర్ పటేల్ తలా ఒక వికెట్ తీశారు.
మొదటి ఇన్నింగ్స్లో భారత్కు 221 పరుగుల అధిక్యం లభించింది. అయితే భారీ ఆధిక్యంతో మ్యాచ్లో గెలవాలనే లక్ష్యంతో ఫాలో ఆన్ ఆడించకుండా టీమిండియా రెండో ఇన్నింగ్స్ మొదలు పెట్టింది. కేఎల్ రాహుల్ 23 పరుగులకే పెవిలియన్ చేరాడు. ఓపెనర్ శుభ్మన్ గిల్, ఛతేశ్వర్ పుజారా బంగ్లా బౌలర్లకు చుక్కలు చూపించారు. గిల్ కెరీర్లో తొలి టెస్ట్ సెంచరీ చేశాడు. పూజారా కూడా సెంచరీ చేయడంతో రెండో ఇన్నింగ్స్లో రెండు వికెట్ల నష్టానికి భారత్ 258 స్కోర్ చేసింది. విరాట్ కోహ్లీ 19 పరుగులతో నాటౌట్గా నిలిచాడు.