Cheteshwar Pujara | న్యూఢిల్లీ: భారత టెస్టు స్పెషలిస్ట్ చతేశ్వర్ పుజారాపై ఇంగ్లండ్ కౌంటీ చాంపియన్షిప్లో నిషేధం పడింది. ఈ టోర్నీలో ససెక్స్ సారథిగా వ్యవహరిస్తున్న పుజారాపై ఒక మ్యాచ్ నిషేధం విధిస్తున్నట్లు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు వెల్లడించింది.
మైదానంలో ప్లేయర్లు నిబంధనలను అతిక్రమించినందుకుగానూ.. ససెక్స్ జట్టుకు 4 డీమెరిట్ పాయింట్లు లభించాయి. దీంతో ససెక్స్ టీమ్కు ఈ సీజన్లో 12 డీమెరిట్ పాయింట్లు పూర్తవడంతో జట్టు కెప్టెన్గా వ్యవహరిస్తున్న పుజారాపై ఒక మ్యాచ్ నిషేధం పడింది. లిసెస్టర్షైర్తో మ్యాచ్లో ససెక్స్ జట్టు సభ్యులు గొడవకు దిగడం ఇందుకు కారణమైంది.