IND vs PAK | న్యూఢిల్లీ: అందరూ ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్న చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ రీషెడ్యూల్ అయ్యే అవకాశం కనిపిస్తున్నది. వాస్తవానికి షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 15న దాయాదుల మధ్య అహ్మదాబాద్లో మ్యాచ్ జరుగాల్సి ఉంది. దీని కోసం ఇప్పటికే అభిమానులు హోటల్ రూమ్లు, విమాన టిక్కెట్లు భారీ మొత్తంలో బుక్ చేసుకున్నారు.
అయితే అక్టోబర్ 15 నుంచి దీపావళి నవరాత్రి ఉత్సవాలు మొదలవుతున్న నేపథ్యంలో భారత్, పాక్ మ్యాచ్కు భద్రత విషయంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశమున్నట్లు తెలిసింది. ఈ కారణంగా మ్యాచ్ను ముందు రోజు మార్చేందుకు ఐసీసీతో బీసీసీఐ సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. ఇదే జరిగితే ఇప్పటికే టిక్కెట్లు బుక్ చేసుకున్న అభిమానుల ఆశలు నీరుగారినట్లే అవుతుంది.