నాగపూర్: ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్లో ఇండియా 400 పరుగులకు ఆలౌటైంది. దీంతో భారత్కు తొలి ఇన్నింగ్స్లో 223 పరుగుల ఆధిక్యం లభించింది. అక్షర్ పటేల్ 84 రన్స్ చేసి ఔటయ్యాడు. తొమ్మిదో వికెట్కు షమీ, అక్షర్ మధ్య 58 పరుగుల భాగస్వామ్యం ఏర్పడింది. షమీ 37 రన్స్ చేశాడు. మూడవ రోజు తొలి సెషన్ భోజన విరామ సమయానికి ఇండియా ఆలౌటైంది.
Lunch on Day 3 of the 1st Test.#TeamIndia all out for 400. Lead by 223 runs.
Rohit Sharma (120)
Axar Patel (84)
Ravindra Jadeja (70)Scorecard – https://t.co/edMqDi4dkU #INDvAUS @mastercardindia pic.twitter.com/iUvZhUrGL1
— BCCI (@BCCI) February 11, 2023
ఇక ఆసీస్ బౌలర్లలో స్పిన్నర్ మర్ఫి మెరిశాడు. అతను ఈ ఇన్నింగ్స్లో ఏడు వికెట్లు తీసుకున్నాడు. అరంగేట్రం మ్యాచ్లోనే అతను సత్తా చాటాడు. 47ఓవర్లు వేసిన మర్ఫి.. 124 రన్స్ ఇచ్చి ఏడు వికెట్లు తీసుకున్నాడు. రెండు వికెట్లు లియాన్కు దక్కగా.. కమ్మిన్స్ తన ఖాతాలో ఓ వికెట్ వేసుకున్నాడు.
India's first innings comes to a close, leading by a commanding 223 runs.#INDvAUS
— cricket.com.au (@cricketcomau) February 11, 2023
నాగపూర్ పిచ్ స్పిన్నర్లకు అనుకూలిస్తోంది. అయితే భారీగా టర్న్ తీసుకుంటున్న ఆ పిచ్పై ఇక అశ్విన్, జడేజా, అక్షర్లు ఏం చేస్తారో చూడాల్సిందే. ఇండియాకు ఆధిక్యం భారీగా ఉన్న నేపథ్యంలో.. మ్యాచ్ ఆసక్తికరంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.