చెన్నై: అనధికారిక వన్డే సిరీస్లో పూర్తి ఆధిపత్యం కనబర్చిన భారత్-‘ఎ’.. మూడో మ్యాచ్లోనూ నెగ్గి సిరీస్ క్లీన్స్వీప్ చేసింది. మంగళవారం న్యూజిలాండ్-‘ఎ’తో జరిగిన పోరులో భారత్ 106 పరుగుల తేడాతో గెలిచింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 49.3 ఓవర్లలో 284 పరుగులకు ఆలౌటైంది. తెలంగాణ యువ ఆటగాడు ఠాకూర్ తిలక్ వర్మ (50)తో పాటు కెప్టెన్ సంజూ శాంసన్ (54), శార్దూల్ ఠాకూర్ (51) అర్ధశతకాలతో మెరవడంతో మన జట్టు మంచి స్కోరు చేసింది.
అనంతరం లక్ష్యఛేదనలో న్యూజిలాండ్-‘ఎ’ 38.3 ఓవర్లలో 178 పరుగులకు ఆలౌటైంది. క్లావెర్ (83) టాప్ స్కోరర్ కాగా.. భారత బౌలర్లలో పేస్ ఆల్రౌండర్ అంగద్ రాజ్బవా 4, కుల్దీప్ యాదవ్, రాహుల్ చాహర్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అండర్-19 ప్రపంచకప్లో ఆకట్టుకున్న రాజ్ బవా భారత్-‘ఎ’ తరఫున బరిలోకి దిగిన తొలి మ్యాచ్లోనే అద్వితీయ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు.