ఈ సఫారీ సిరీస్లో తొలి మ్యాచ్ ఆడుతున్న పేసర్ ఉమేష్ యాదవ్ సత్తాచాటాడు. 223 పరుగులకే భారత్ ఆలౌట్ అవడంతో ఇన్నింగ్స్ నిలబెట్టాల్సిన భారం బౌలర్లపై పడింది. ఇలాంటి సమయంలో రెండో టెస్టు హీరో డీన్ ఎల్గార్ (3)ను స్వల్ప స్కోరుకే పెవిలియన్ పంపిన బుమ్రా.. భారత్కు శుభారంభం అందించాడు.
ఆ తర్వాత రెండో రోజు కూడా తన ఫామ్ కొనసాగించిన అతను.. ఎయిడెన్ మార్క్రమ్ (8)ను కూడా అవుట్ చేశాడు. కానీ మిగతా బౌలర్లు పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. అదే సమయంలో నైట్ వాచ్మెన్గా వచ్చిన కేశవ్ మహరాజ్ (25) చక్కగా బ్యాటింగ్ చేస్తూ అందరి దృష్టినీ ఆకర్షించాడు. అలాంటి సమయంలో బౌలింగ్కు వచ్చిన ఉమేష్ యాదవ్.. 21వ ఓవర్ రెండో బంతికి కేశవ్ మహరాజ్ను బౌల్డ్ చేశాడు.
బంతిని స్ట్రెయిట్ షాట్ ఆడేందుకు కేశవ్ ప్రయత్నించాడు. కానీ ఆ బంతి లోపలి వైపుగా వచ్చి బ్యాట్ను తప్పించుకొని మిడ్వికెట్ను కూల్చింది. దీంతో కేశవ్ మహరాజ్ ఇన్నింగ్స్ ముగిసింది. 45 పరుగుల వద్ద సఫారీలు మూడో వికెట్ కోల్పోయారు.