బెంగళూరు వేదికగా జరుగుతున్న టీ20 మ్యాచ్లో భారత జట్టు తొలి వికెట్ కోల్పోయింది. ధాటిగా ఇన్నింగ్స్ ఆరంభించిన ఇషాన్ కిషన్ (15) పెవిలియన్ చేరాడు. ఎన్గిడీ వేసిన రెండో ఓవర్ చివరి బంతికి అతను అవుటయ్యాడు. ఆల్మోస్ట్ యార్కర్ లెంగ్త్ బంతిని నేరుగా ఆడేందుకు ప్రయత్నించిన ఇషాన్.. మిస్ అయ్యాడు. దాంతో అది వికెట్లను కూల్చింది.
వర్షం కారణంగా ఆలస్యమైన ఈ మ్యాచ్ను 19 ఓవర్లకు కుదించిన సంగతి తెలిసిందే. అలాంటి సమయంలో క్రీజులోకి వచ్చిన ఇషాన్.. తొలి ఓవర్లోనే రెండు భారీ సిక్సర్లు కొట్టాడు. అదే ఊపు కొనసాగిస్తాడనుకున్న అభిమానులు.. అతను పెవిలియన్ చేరడంతో నిరాశ చెందారు.
ఆ తర్వాత నాలుగో ఓవర్ రెండో బంతికే రుతురాజ్ గైక్వాడ్ (12) కూడా పెవిలియన్ చేరాడు. ఎన్గిడీ వేసిన బంతిని సరిగా అంచనా వేయలేకపోయిన అతను.. ప్రిటోరియస్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.