మూడో వన్డేలో భారత జట్టు కష్టాల్లో పడింది. ఐదు వికెట్లు కోల్పోయి గెలుపు కోసం తీవ్రంగా శ్రమించాల్సిన పరిస్థితిలో ఉన్న టీమిండియాకు మరో షాక్ తగిలింది. స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ (39) పెవిలియన్ చేరాడు.
దీంతో భారత జట్టు ఆరు వికెట్లు కోల్పోయి కష్టాల్లో కూరుకుపోయింది. ఇక మిగిలిన వారంతా బౌలర్లు, టెయిలెండర్లే కావడంతో వారిపైనే భారత్ను గెలిపించాల్సిన బాధ్యత పడింది. ప్రిటోరియస్ బౌలింగ్లో టాప్ ఎడ్జ్ తీసుకున్న బంతిని సఫారీ కెప్టెన్ బవుమా క్యాచ్ పట్టేయడంతో సూర్యకుమార్ పెవిలియన్ చేరాడు.
ఆ తర్వాత కాసేపటికే ఎన్గిడీ బౌలింగ్లో జయంత్ యాదవ్ (2) కూడా పెవిలియన్ చేరాడు. దీంతో భారత జట్టు 227/7 స్కోరుతో నిలిచింది. గెలవాలంటే టీమిండియా ఇంకా 69 పరుగులు చేయాల్సి ఉంది.