భారత్తో జరుగుతున్న నిర్ణయాత్మక మూడో వన్డేలో సౌతాఫ్రికా జట్టు తడబడుతోంది. పది ఓవర్లకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన ఆ జట్టుకు షాబాజ్ అహ్మద్ మరో షాకిచ్చాడు. ఆ జట్టు టాప్ బ్యాటర్ ఎయిడెన్ మార్క్రమ్ను అవుట్ చేశాడు. షాబాజ్ వేసిన జఫ్ఫాను ముందుకొచ్చి డ్రైవ్ చేసేందుకు మార్క్రమ్ ప్రయత్నించాడు. ఈ క్రమంలో చాలా స్వల్పంగా అవుట్సైడ్ ఎడ్జ్ తీసుకున్న బంతిని కీపర్ సంజూ శాంసన్ చటుక్కున పట్టేశాడు. దీంతో మార్క్రమ్ నిరాశగా పెవిలియన్ చేరాడు. సఫారీ జట్టు 16 ఓవర్లు ముగిసే సరికి 4 వికెట్ల నష్టానికి 44 పరుగులతో నిలిచింది.