సఫారీ టూర్లో అద్భుతంగా రాణిస్తున్న పేసర్ మహమ్మద్ షమీ మరోసారి సత్తా చాటాడు. వాండరర్స్ మైదానంలో జరుగుతున్న రెండో టెస్టులో భారత బ్యాటింగ్ కుదేలైనప్పటికీ.. బౌలింగ్లో జట్టుకు శుభారంభం అందించాడు.
తన లైన్ అండ్ లెంగ్త్తో సఫారీ బ్యాటర్లను ఇబ్బంది పెడుతున్న షమీ.. మరోసారి అదే పద్ధతిలో సౌతాఫ్రికా ఓపెనర్ ఎయిడెన్ మార్క్రమ్ (7)ను బోల్తా కొట్టించాడు. షమీ వేసిన బంతిని అంచనా వేయలేకపోయిన మార్క్రమ్ ఎల్బీగా పెవిలియన్ చేరాడు. ఈ పిచ్పై సఫారీ బౌలర్లు అద్భుతంగా రాణించి భారత బ్యాటర్లను ఇబ్బంది పెట్టారు.
కేఎల్ రాహుల్, అశ్విన్ మినహా మిగతా భారత బ్యాటర్లెవరూ రాణించలేదు. దీంతో భారత జట్టు తొలి ఇన్నింగ్స్లో 202 పరుగులకే కుప్పకూలింది. ఈ ఇన్నింగ్స్లో మంచి స్కోరు చేసి భారత జట్టు ముందు భారీ లక్ష్యం ఉంచాలని ప్రొటీస్ జట్టు భావిస్తోంది.