వాండరర్స్ టెస్టులో వెటరన్ ఆటగాళ్లు ఛటేశ్వర్ పుజారా, అజింక్య రహానే జట్టును ఆదుకుంటున్నారు. తాత్కాలిక కెప్టెన్ కేఎల్ రాహుల్ (7) అనూహ్యంగా స్వల్పస్కోరుకే వెనుతిరగడంతో.. భారత జట్టు ఈ మ్యాచులో భారీ స్కోరు చేయడం జరగదని అభిమానులు అనుకున్నారు.
అయితే ఎవరూ ఊహించని విధంగా పుజారా (51 నాటౌట్), రహానే (52 నాటౌట్) అర్థశతకాలతో రాణించారు. సఫారీల తొలి ఇన్నింగ్స్లో పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ శార్దూల్ ఠాకూర్ 8 వికెట్లతో సత్తాచాటడంతో.. సౌతాఫ్రికా జట్టు 229 పరుగులు చేసి భారత్పై 27 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. ఇలాంటి పరిస్థితుల్లో రాహుల్, మయాంక్ (23) త్వరగా అవుటవడంతో అభిమానులు ఆందోళన చెందారు.
అయితే ఎన్ని అవకాశాలు ఇచ్చినా సరిగా ఉపయోగించుకోలేక అవస్థలు పడిన సీనియర్ బ్యాటర్ల ద్వయం భారత్కు అండగా నిలిచింది. వీరిద్దరూ నిలకడగా ఆడుతుండటంతో భారత జట్టు 33 ఓవర్లు ముగిసే సరికి 148/2తో నిలిచింది.