స్వల్ప లక్ష్య ఛేదనలో భారత జట్టు రెండో వికెట్ కోల్పోయింది. ధవన్ అవుటవడంతో క్రీజులోకి వచ్చిన ఇషాన్ కిషన్ (10) కూడా పెవిలియన్ చేరాడు. ఫోర్టూయిన్ వేసిన 11వ ఓవర్లో బంతిని ఆఫ్సైడ్ ఆడేందుకు ప్రయత్నించిన ఇషాన్ మిస్సయ్యాడు. ఈ క్రమంలో లైట్గా ఇన్సైడ్ ఎడ్జ్ తీసుకున్న బంతిని కీపర్ డీకాక్ పట్టేశాడు. సఫారీ జట్టు అప్పీల్ చేయగా అంపైర్ అవుటిచ్చాడు. అయితే కిషన్ రివ్యూ కోరాడు. రిప్లేలో అతని బ్యాటుకు బంతి తాకినట్లే తేలింది. దీంతో కిషన్ నిరాశగా పెవిలియన్ చేరాడు. భారత జట్టు 11 ఓవర్లకు 59/2 స్కోరుతో నిలిచింది.