తొలి ఇన్నింగ్స్లో ధనాధన్ ఆటతీరుతో జట్టుకు గౌరవప్రదమైన స్కోరు అందించిన రవిచంద్రన్ అశ్విన్.. రెండో ఇన్నింగ్సులో నిరాశపరిచాడు. వాండరర్స్ టెస్టు రెండో ఇన్నింగ్సులో 16 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పెవిలియన్ చేరాడు. రహానే, పుజారా, పంత్ వెంట వెంటనే అవుటవడంతో భారత జట్టు ఒత్తిడిలో పడింది.
అలాంటి పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన అశ్విన్.. రెండు బౌండరీలతో ఆకట్టుకున్నాడు. మొదటి ఇన్నింగ్స్ మ్యాజిక్ రిపీట్ చేస్తాడని అందరూ అనుకున్నారు. అయితే ఎన్గిడీ బౌలింగ్లో లెగ్స్టంప్ దిశగా వచ్చిన బంతిని ఫ్లిక్ ఆడే ప్రయత్నింలో విఫలమైన అశ్విన్.. కీపర్ వెరెన్నేకు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు.
దీంతో క్రీజులోకి శార్దూల్ ఠాకూర్ వచ్చాడు. అతను కూడా తను ఎదుర్కొన్న రెండో బంతికే బౌండరీ బాదాడు. ప్రస్తుతం క్రీజులో విహారి, శార్దూల్ ఉన్నారు. లంచ్ సమయానికి భారత జట్టు 188/6 స్కోరుతో నిలిచింది. ప్రస్తుతం సౌతాఫ్రికాపై భారత జట్టు 161 పరుగుల ఆధిక్యంలో ఉంది.