భారత్తో జరుగుతున్న తొలి టెస్టులో సౌతాఫ్రికా పేసర్లు నిప్పులు చెరిగారు. రెండో రోజు ఆట వర్షం కారణంగా రద్దవడంతో మూడో రోజు చాలా కీలకంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో సౌతాఫ్రికా పేసర్లు విజృంభించారు. తొలి రోజు ప్రభావం చూపిన లుంగి ఎన్గిడీ మరోసారి సత్తా చాటగా.. అతనికి వెటరన్ పేసర్ రబాడ జత కలిశాడు. దీంతో భారత బ్యాటర్లు విలవిల్లాడారు. మూడోరోజు మొత్తం 15 ఓవర్లు మాత్రమే ఎదుర్కొన్న భారత బ్యాటర్లు 7 వికెట్లు కోల్పోయారు.
తొలి రోజు కేఎల్ రాహుల్ (123) తన స్కోరుకు ఒక్క పరుగు జోడించి వెనుతిరగ్గా.. నిలకడగా ఆడుతున్న అజింక్య రహానే (48) తొలిరోజు స్కోరుకు 8 పరుగులు జోడించి పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత వచ్చిన రిషభ్ పంత్ (8), అశ్విన్ (4), శార్దూల్ ఠాకూర్ (4), మహమ్మద్ షమీ (8) వచ్చినవాళ్లు వచ్చినట్లే పెవిలియన్కు క్యూ కట్టారు.
చివర్లో జస్ప్రీత్ బుమ్రా (14), సిరాజ్ (4 నాటౌట్) పరుగులు చేశారు. దీంతో భారత జట్టు 327 పరుగులకు ఆలౌట్ అయింది. సౌతాఫ్రికా బౌలర్లలో ఎన్గిడీ ఆరు వికెట్లు తీయగా, రబాడ మూడు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. చివర్లో మార్కో జాన్సెన్.. బుమ్రా వికెట్ తీశాడు.