కాన్పూర్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో భారత బౌలర్లు శ్రమిస్తున్నారు. నాలుగో రోజు 4/1తో ఇన్నింగ్స్ ముగించిన కివీస్ను ఉమేష్ యాదవ్ దెబ్బకొట్టాడు. నైట్ వాచ్మెన్ విల్ సోమర్విల్లె (36)ను అవుట్ చేశాడు. మరో ఓపెనర్ టామ్ లాథమ్ (52) అర్ధశతకంతో రాణించినా, చివరకు అశ్విన్ బౌలింగ్లో బౌల్డ్ అయ్యాడు.
ఆ తర్వాత వెటరన్ రాస్ టేలర్ (2)ను జడేజా ఎల్బీగా పెవిలియన చేర్చాడు. కాసేపటికే హెన్రీ నికోల్స్ (1)ను అక్షర్ అవుట్ చేశాడు. ప్రస్తుతం క్రీజులో కివీ కెప్టెన్ కేన్ విలియమ్సన్ (24 నాటౌట్), టామ్ బ్లండెల్ ఉన్నారు. భారత బౌలర్లలో అశ్విన్ రెండు వికెట్లు తీయగా.. ఉమేష్ యాదవ్, జడేజా, అక్షర్ తలో వికెట్ కూల్చారు.