IND vs NZ | కివీస్తో జరుగుతున్న టీ20 మ్యాచ్లో టీమిండియా సారధి రోహిత్ శర్మ (55) అర్థశతకం పూర్తి చేసుకున్న వెంటనే అవుటయ్యాడు. సౌథీ వేసిన 16వ ఓవర్ మూడో బంతికి.. కవర్స్లో ఫీల్డింగ్ చేస్తున్న గప్తిల్కు సులభమైన క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు.
ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్ కూడా వెంటనే పెవిలియన్ చేరాడు. సౌథీ బంతిని సరిగా అంచనా వేయలేకపోవడంతో ఇన్సైడ్ ఎడ్జ్ తీసుకున్న బంతి వికెట్లను కూల్చింది. దీంతో 16 ఓవర్లు ముగిసేసరికి భారత జట్టు 137/3తో నిలిచింది.