Ravichandran Ashwin | టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ధర్మశాలలో అరుదైన ఘనత అందుకోబోతున్నాడు. మార్చి 07 నుంచి మొదలుకాబోయే ఈ టెస్టు అశ్విన్ కెరీర్లో వందో టెస్టు మ్యాచ్ కావడం విశేషం. రాంచీలో ముగిసిన టెస్టు అశ్విన్కు 99వది. ధర్మశాలలో వందో టెస్టు ఆడనున్న అశ్విన్ కంటే ముందు భారత్ నుంచి మరో 13 మంది క్రికెటర్లు శతాధిక టెస్టులు ఆడారు. ఆ జాబితా కింది విధంగా ఉంది.
భారత్లో వంద టెస్టులు, ఆపై ఆడిన ఆటగాళ్లలో సచిన్ టెండూల్కర్ అందరికంటే ముందున్నాడు. సచిన్.. 200 టెస్టులు ఆడాడు. ఆ తర్వాత స్థానంలో ప్రస్తుత టీమిండియా హెడ్కోచ్ రాహుల్ ద్రావిడ్ ఉన్నాడు. ద్రావిడ్ తన సుదీర్ఘ కెరీర్లో 163 ట్టెసులు ఆడాడు. ఈ జాబితాలో ద్రావిడ్ తర్వాత వీవీఎస్ లక్ష్మణ్ (134), అనిల్ కుంబ్లే (132), కపిల్ దేవ్ (131),సునీల్ గవాస్కర్ (125), దిలీప్ వెంగ్సర్కార్ (116), సౌరవ్ గంగూలీ (113), విరాట్ కోహ్లీ (113), ఇషాంత్ శర్మ (105), హర్భజన్ సింగ్ (103), ఛతేశ్వర్ పుజారా (103), వీరేంద్ర సెహ్వాగ్ (103)లు ఉన్నారు. 99 టెస్టులు ఆడి వంద టెస్టులు పూర్తిచేయని ఏకైక భారత క్రికెటర్ మహ్మద్ అజారుద్దీన్.
2011లో భారత టెస్టు జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన అశ్విన్.. 99 టెస్టులలో 507 వికెట్లు పడగొట్టాడు. 116 వన్డేలు ఆడిన అతడు.. 156 వికెట్లు తీయగా 65 టీ20లలో 72 వికెట్లు తీశాడు. టెస్టులలో ఇటీవలే 500 వికెట్ల ఘనతను చేరిన అశ్విన్.. ఒక జట్టు (ఇంగ్లండ్)పై వెయ్యి పరుగులు, వంద వికెట్లు తీసిన క్రికెటర్గానూ రికార్డులకెక్కాడు.
Ravichandran Ashwin will become the 14th Indian to complete 100 Tests on March 7th. 🇮🇳👌 pic.twitter.com/dItiPYRFFn
— Johns. (@CricCrazyJohns) February 29, 2024
బెయిర్ స్టో కూడా..
అశ్విన్తో పాటు ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జానీ బెయిర్ స్టో కూడా వందో టెస్టు ఆడనున్నాడు. 2012లో టెస్టు అరంగేట్రం చేసిన అశ్విన్.. ఇప్పటివరకూ 99 టెస్టులలో 5,9 పరుగులు చేశాడు. అతడి ఖాతాలో 12 శతకాలు, 26 అర్థ శతకాలున్నాయి.