ఇండియన్వెల్స్ : పిఎన్బి పారిబస్ ఓపెన్ టెన్నిస్ టోర్నీలో టాప్ ర్యాంక్ క్రీడాకారిణి ఇగా స్వియాటెక్ అప్రతిహతంగా దూసుకుపోతోంది. శనివారం జరిగిన పోరులో స్వియాటెక్ 6-0, 6-1తో 65 నిమిషాల్లో క్లేర్ లియుపై గెలుపొందింది. ఈ క్రమంలో స్వియాటెక్ తొలి సెట్లో కేవలం ఏడు పాయింట్లు మాత్రమే ప్రత్యర్థికి వదులుకుంది. లియు ఏ దశలోనూ స్వియాటెక్కు పోటీ ఇవ్వలేకపోయింది.
పురుషుల డిఫెండింగ్ చాంపియన్ టేలర్ ఫ్రిట్జ్ 4-6, 6-4, 6-3తో బెన్ షెల్టన్పై గెలుపొందాడు. ఇతర మ్యాచ్లలో ఆండీ ముర్రే 6-4, 6-3తో రదు అల్బాట్పై, జానిక్ సిన్నర్ 6-3, 7-6(7-2)తో రిచర్డ్ గాస్కెట్పై, జాక్ డ్రేపర్ 6-4, 6-2తో డాన్ ఇవాన్స్పై, ఫెలిక్స్ అగర్ అలియాసిమి 7-6(7-5), 6-4తో పెడ్రొ మార్టినెజ్పై గెలుపొందారు. మహిళల విభాగంలో ఎమ్మా రదుకాను 7-6(7-3), 6-2తో మగ్ద లినెట్పై, కరోలినా గార్సియా 6-1, 6-7(4-7), 6-4తో డాల్మా గాల్ఫిపై, డారియా కసట్కిన 6-2, 6-1తో తాత్యానా మారియాపై, కరోలిన ముచోవ 7-6(7-1), 6-3తో విక్టోరియ అజరెంకపై విజయాలు నమోదు చేశారు.