న్యూఢిల్లీ: టీమిండియా క్రికెట్ జట్టు తొలి వన్డే వరల్డ్కప్ను 1983లో గెలిచిన విషయం తెలిసిందే. ఆ సమయంలో జట్టు కెప్టెన్ కపిల్ దేవ్(Kapil Dev). అయితే ఆదివారం జరిగిన వరల్డ్కప్ ఫైనల్ మ్యాచ్కు తనను ఆహ్వానించలేదని కపిల్ దేవ్ అన్నాడు. ఫైనల్ మ్యాచ్ను వీక్షించేందుకు 83 నాటి జట్టుతో వెళ్లాలని భావించానని, కానీ తమకు బీసీసీఐ నుంచి కానీ, ఐసీసీ నుంచి కానీ పిలుపు రాలేదని కపిల్ అన్నారు. ఆహ్వానం లేదని, పిలవలేదు కాబట్టి అక్కడకు వెళ్లలేదన్నాడు. 83 నాటి జట్టుతో వెళ్లాలని అనుకున్నాను, అయితే పెద్ద ఈవెంట్ సమయంలో బాధ్యతల్లో ఉన్నవాళ్లు బిజీగా ఉంటారని, బహుశా వాళ్లు మరిచిపోయి ఉంటారని కపిల్ పేర్కొన్నాడు. మాజీ కెప్టెన్లలో కేవలం గంగూలీ మాత్రమే ఫైనల్ మ్యాచ్కు హాజరయ్యాడు.