న్యూఢిల్లీ: బీసీసీఐ నూతన అధ్యక్షుడిగా నియమితులైన రోజర్ బిన్నీ భారత క్రికెట్కు సంబంధించి ప్రధానంగా రెండు అంశాలపై దృష్టి సారించనున్నట్లు తెలిపారు. తన మొదటి ప్రాధాన్యం ఆటగాళ్లు గాయాలపాలు కాకుండా చూసుకోవడమని చెప్పారు. ఆటగాళ్లకు గాయాలైతే జట్టు కూర్పులో సమస్యలు వస్తాయని అభిప్రాయపడ్డారు.
జస్ప్రీత్ బుమ్రా గాయాపడటాన్ని ఈ సందర్భంగా రోజర్ బిన్నీ ప్రస్తావించారు. వరల్డ్ కప్కు కొన్ని రోజుల ముందు బుమ్రా గాయపడటంతో జట్టు మొత్తం ప్రణాళికపైనే ప్రభావం పడిందన్నారు. ఇక తన రెండో ప్రాధాన్యం దేశంలోని వివిధ క్రికెట్ మైదానాల్లోని పిచ్లు అని చెప్పారు. అందువల్ల పిచ్లపై దృష్టి సారిస్తానని బిన్నీ పేర్కొన్నారు.
కాగా, రోజర్ బిన్నీ ఇవాళ బీసీసీఐ 36వ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. 1983లో తొలిసారి వరల్డ్ కప్ గెలిచిన జట్టులో ఆయన సభ్యుడిగా ఉన్నారు. ఆ టోర్నీలో మొత్తం 18 వికెట్లు తీసిన బిన్నీ.. బౌలర్గా కీలకపాత్ర పోషించారు.