న్యూఢిల్లీ: బ్యాడ్మింటన్ కోర్టులో దిగాక ఒత్తిడిని తట్టుకోవడమెలాగో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ను చూసి నేర్చుకున్నానని పారాలింపిక్స్లో స్వర్ణం సాధించిన ప్రమోద్ భగత్ అన్నాడు. ఢిల్లీలో ఆదివారం అతడు సచిన్ను మర్యాదపూర్వకంగా కలిశాడు. ‘నా చిన్నతనంలో క్రికెట్ ఆడేవాడిని. అప్పుడు దూరదర్శన్లో సచిన్ ఆట చూడటానికి ఎంతో ఇష్టపడే వాడిని. సచిన్ క్రీజులో ఉన్నప్పుడు ఒత్తిడిని అధిగమిస్తూ ప్రశాంతంగా ఉండే విధానం నామీద ఎక్కువ ప్రభావం చూపింది. అప్పట్నుంచి నేను సచిన్ను ఫాలో అవడం మొదలుపెట్టా. నేను కోర్టులో అడుగుపెట్టేటప్పుడు కూడా సచిన్ మాదిరే ప్రశాంత మనస్తత్వంతో ఉంటా. ఇది నాకు చాలా మేలు చేసింది. తద్వారా నేను ఎన్నో చిరస్మరణీయ విజయాలు సాధించా’ అని ప్రమోద్ అన్నాడు.