హైదరాబాద్, ఆట ప్రతినిధి: జైపూర్ వేదికగా జరిగిన చాలెంజర్ సిరీస్లో భారత్ ‘బి’ 92 పరుగుల తేడాతో భారత్ ‘ఎ’పై ఘన విజయం సాధించింది. భారత్ ‘బి’ తరఫున బరిలోకి దిగిన రాష్ట్ర యువ క్రికెటర్ త్రిష(112) సూపర్ సెంచరీతో కదంతొక్కింది. ప్రత్యర్థి బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ తన ఇన్నింగ్స్లో 17 ఫోర్లతో ఆకట్టుకుంది. త్రిషకు తోడు మరో ఓపెనర్ అనుష్క శర్మ(72) అర్ధసెంచరీతో భారత్ ‘బి’ నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్లకు 221 పరుగులు చేసింది. ముస్కాన్(2/33) రెండు వికెట్లు తీసింది. లక్ష్యఛేదనలో భారత్ ‘ఎ’ 41.3 ఓవర్లలో 129 పరుగులకు కుప్పకూలింది.