ముంబై: భాగ్యనగర వాసులకు రేసింగ్ అనుభూతిని పంచేందుకు ఫార్ములా రేసులు రాబోతున్నాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరుగబోయే ఫార్ములా-4 రేసులను హైదరాబాద్తో పాటు న్యూఢిల్లీ, చెన్నై, కోయంబత్తూరులోనూ నిర్వహించనున్నట్టు రేసింగ్ ప్రమోషన్స్ (ఆర్పీపీఎల్) నిర్వాహకులు తెలిపారు. ఫెడరేషన్ ఇంటర్నేషనల్ ఆటోమొబైల్ (ఎఫ్ఐఏ) మద్దతుతో ఎఫ్-4 ఇండియన్ చాంపియన్షిప్, ఫార్ములా రీజినల్ ఇండియన్ చాంపియన్షిప్ పోటీలను ఈ నాలుగు నగరాలలో నిర్వహించనున్నారు. ఎఫ్-3 కార్లతో నిర్వహించబోయే ఈ పోటీలు భారత్లో ఇదే తొలిసారి. వీటి నిర్వహణ కోసం హైదరాబాద్లో ఇప్పటికే వంద కోట్ల రూపాయలను కార్లు, మౌలిక వసతులపై వెచ్చించినట్టు నిర్వాహకులు తెలిపారు.