హైదరాబాద్, ఆట ప్రతినిధి : ఆలిండియా సబ్ జూనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో హైదరాబాద్ యువ షట్లర్ నిమ్మ శాన్విరెడ్డి అద్భుత ప్రదర్శన చేసింది. గోవాలో జరిగిన ఈ టోర్నీ అండర్-13 సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో చాంపియన్గా నిలిచి డబుల్ ధమాకా మోగించింది.
సింగిల్స్ ఫైనల్లో రెండో సీడ్ శాన్వి 21-9, 21-9తో ఏడో దివిశా సింగ్ (మహారాష్ట్ర)ను వరుస గేమ్స్లో చిత్తు చేసి టైటిల్ సొంతం చేసుకుంది. డబుల్స్లో రాష్ర్టానికి చెందిన కొరుకొండ లియోషాతో జత కట్టి టాప్ సీడ్గా బరిలో నిలిచిన శాన్విరెడ్డి 21-19, 21-18తో కర్ణాటక ద్వయం శాంభవి శర్మ-పీఎన్ శాన్విపై వరుస గేమ్స్లో గెలిచి రెండో ట్రోఫీ ఖాతాలో వేసుకుంది.