హైదరాబాద్: భారత యాచింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలోజరిగిన జాతీయ యూత్, కైట్బోర్డ్ చాంపియన్షిప్లో హైదరాబాద్ సెయిలర్లు ఆరు పతకాలతో సత్తాచాటారు. కృష్ణరాజా సాగర్ రిజర్వాయర్ వేదికగా జరిగిన టోర్నీలో వైష్ణవి వీరవంశం పసిడి పతకంతో మెరువగా, ఝాన్సీ ప్రియ కాంస్య పతకం సొంతం చేసుకుంది. బాలికల సబ్జూనియర్ విభాగంలో తనూజ కామేశ్వర్ రజత పతకం సొంతం చేసుకుంది. సబ్జూనియర్ ర్యాంకింగ్స్లో ప్రస్తుతం రెండో ర్యాంక్లో కొనసాగుతున్న తనూజ ఆసియా టోర్నీకి అర్హత సాధించే ప్రయత్నంలో ఉంది. లైట్వెయిట్ గ్రీన్ఫ్లీట్ విభాగంలో లాహిరి స్వర్ణం దక్కించుకోగా, సాహిత్ రజతం సొంతం చేసుకున్నాడు. మొత్తంగా టోర్నీలో హైదరాబాద్ సెయిలర్లు ఆరు పతకాలు కైవసం చేసుకోవడం సంతోషంగా ఉందని యాచ్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ అధ్యక్షుడు సుహేమ్ షేక్ పేర్కొన్నాడు.