హైదరాబాద్, ఆట ప్రతినిధి: జాతీయ ఈక్వెస్ట్రియన్ అర్హత టోర్నమెంట్లో హైదరాబాద్ రైడర్ జనంపల్లి హితేశ్ రెడ్డి సత్తా చాటాడు. నగరంలోని నాసర్ పోలో అకాడమీలో గురువారం జరిగిన డ్రెస్సేజ్-1 విభాగంలో మెరిసి ప్రధాన టోర్నీకి అర్హత సాధించాడు. హెచ్పీఆర్సీ అకాడమీకి చెందిన హితేశ్ సెంటార్ గుర్రంపై రైడింగ్ చేసి 60.822 స్కోరుతో ఆకట్టుకోగా.. యువరాజ్ రోహిత్ గుప్తా 54.447 స్కోరు నమోదు చేశాడు.