టిను ఆనంద్, ఉపేంద్ర, జార్జ్ మరియన్, అక్షయ్, విష్ణు తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న న్యూ ఏజ్ క్రైమ్ కామెడీ చిత్రం ‘బా బా బ్లాక్షీప్’. గుణి మంచికంటి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వేణు దోనెపూడి నిర్మిస్తున్నారు. అక్టోబర్ 9న ప్రేక్షకుల ముందుకురానుంది.
ఇటీవల ఈ సినిమా నుంచి ‘వేవేల ఊహలే చూపినా…’ పాటను అగ్ర దర్శకుడు అనిల్ రావిపూడి విడుదల చేశారు. ఎలక్ట్రానిక్ కిలి, ఆర్కాడో సంగీతాన్నందించిన ఈ పాటను కిట్టు విస్సాప్రగడ రచించారు. మేఘాలయా రాష్ట్రంలోనే మొత్తం చిత్రీకరణ జరిపామని, ఇంట్రెస్టింగ్ క్రైమ్ ఎలిమెంట్ నేపథ్యంలో ఆకట్టుకుంటుందని మేకర్స్ తెలిపారు.