హైదరాబాద్, ఆట ప్రతినిధి: ఆల్ ఇండియా ఇన్విటేషనల్ ఫుట్బాల్ టోర్నమెంట్లో హైదారాబాద్ ఫుట్బాల్ క్లబ్ సెమీఫైనల్లో ఓటమి పాలైంది. మహారాష్ట్ర వేదికగా జరుగుతున్న ఈ టోర్నీ సెమీఫైనల్లో హైదరాబాద్ 0-1తో అహ్మదాబాద్ ఫుట్బాల్ క్లబ్ చేతిలో పరాజయం పాలైంది. మ్యాచ్ ఆరంభం నుంచి ఇరు జట్లు హోరాహోరీగా పోరాడగా.. మరో మూడు నిమిషాల్లో ఆట ముగుస్తుందనగా.. అహ్మదాబాద్ జట్టు ఏకైక గోల్ చేసింది. అప్పటి వరకు చక్కటి ప్రదర్శన కనబర్చిన హైదరాబాద్.. ఆఖరి క్షణాల్లో స్కోరు సమం చేయలేకపోగా.. అహ్మదాబాద్ ఫైనల్లో అడుగుపెట్టింది.