HCA | హైదరాబాద్, ఆట ప్రతినిధి: జిల్లాల్లో క్రికెట్ అభివృద్ధికి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) కమిటీలను ఏర్పాటు చేసింది. దీంతో పాటు ఉమ్మడి జిల్లాల్లో 10 మినీ స్టేడియంలు నిర్మించాలని తీర్మానించింది. ఆదివారం హెచ్సీఏ అధ్యక్షుడు అర్శనపల్లి జగన్మోహన్రావు అధ్యక్షతన వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం)లో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
ఉప్పల్ స్టేడియంలో 250 మందికి బోర్డింగ్ సదుపాయంతో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన క్రికెట్ ఎక్సలెన్స్ అకాడమీ ఏర్పాటు చేయాలని సమావేశంలో నిర్ణయించారు. ఏజీఎంలో టీమ్ఇండియా మాజీ కెప్టెన్ మహమ్మద్ అజారుద్దీన్, శివ్లాల్ యాదవ్, అర్షద్ అయూబ్, వినోద్, అనిల్ జాన్ మనోజ్, హనుమంతరావు, చాముండేశ్వరినాథ్, వంకా ప్రతాప్, ఆగంరావు తదితరులు పాల్గొన్నారు.