గత కామన్వెల్త్ (2018, గోల్డ్కోస్ట్) క్రీడల్లో కాంస్య పతకంతో మెరిసిన తెలంగాణ బాక్సర్ మహమ్మద్ హుసాముద్దీన్.. తాజా పోటీల్లో పతకానికి అడుగు దూరంలో నిలిచాడు. సోమవారం జరిగిన పురుషుల 56 కేజీల బౌట్లో హుసాముద్దీన్ 5-0తో సలీం హుసేన్ (బంగ్లాదేశ్)పై విజయం సాధించి క్వార్టర్ ఫైనల్కు దూసుకెళ్లాడు. మరో పోరులో భారత స్టార్ బాక్సర్ అమిత్ పంగల్ (51 కేజీలు) నమ్రీ బెర్రి (వనూతు)ను చిత్తు చేశాడు. టోక్యో ఒలింపిక్స్లో స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చలేకపోయిన అమిత్.. తాజా బౌట్ మూడు రౌండ్లలోనూ ప్రత్యర్థిపై పంచ్లతో విరుచుకుపడ్డాడు. క్వార్టర్స్లో ట్రైగైన్ (నమీబియా)తో హుసాముద్దీన్.. లెనాన్ (స్కాట్లాండ్)తో అమిత్ అమీతుమీ తేల్చుకోనున్నారు.