న్యూఢిల్లీ: భారత స్టార్ షట్లర్లు పీవీ సింధు, లక్ష్యసేన్, ప్రణయ్ మంగళవారం నుంచి ప్రారంభమవుతున్న ఇండియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీకి సిద్ధమయ్యారు. స్వదేశంలో జరుగనున్న బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ సూపర్-750 టోర్నీలో లక్ష్యసేన్.. డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగనుండగా.. గాయం అనంతరం తొలి టైటిల్ సాధించేందుకు సింధు రెడీ అయింది. పురుషుల డబుల్స్లో సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి జోడీపై భారీ అంచనాలు ఉండగా.. హెచ్ ఎస్ ప్రణయ్, సైనా నెహ్వాల్ సహా పలువురు యువ ఆటగాళ్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. మరోవైపు.. భారత్లో మరో రెండు అంతర్జాతీయ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లకు బీడబ్ల్యూఎఫ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.