న్యూఢిల్లీ: భారత పురుషుల హాకీ జట్టు మిడ్ఫీల్డర్ హార్దిక్ సింగ్, మహిళల టీమ్ గోల్ కీపర్ సవిత పునియా ‘హాకీ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డులు అందుకున్నారు. నిరుడు అద్వితీయ ప్రదర్శనకు గాను హాకీ ఇండియా (హెచ్ఐ) శుక్రవారం దేశ రాజధానిలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో వీరికి ఈ పురస్కారాలు అందజేసింది.