న్యూఢిల్లీ: టోక్యో పారాలింపిక్స్లో స్వర్ణం నెగ్గిన అవని లేఖరా.. పారా షూటింగ్ ప్రపంచకప్లో రికార్డు స్కోరుతో పసిడి పతకం పట్టింది. ఫ్రాన్స్ వేదికగా మంగళవారం జరిగిన మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఎస్హెచ్1 విభాగంలో అవని 250.6 పాయింట్లు ఖాతాలో వేసుకొని ప్రపంచ రికార్డు (249.6)ను బద్దలు కొట్టింది. ఈ ప్రదర్శనతో అవని 2024 పారిస్ పారాలింపిక్స్కు అర్హత సాధించింది. ‘ప్రపంచ రికార్డు స్కోరుతో పసిడి పట్టడం ఆనందంగా ఉంది. దీంతో పాటు పారిస్ పారాలింపిక్స్ బెర్త్ ఖరారు చేసుకోవడం ఆ సంతోషాన్ని రెట్టింపు చేసింది’ అని అవని పేర్కొంది.