IPL Retention | వచ్చే ఏడాది జరిగే ఐపీఎల్-2022 టోర్నీల్లో వివిధ ఫ్రాంచైసీలు ఇప్పటి వరకు తమ జట్లకు ఆడిన క్రికెటర్ల రిటెన్షన్ ప్రక్రియ మంగళవారం సాగింది. ఇంటర్నేషనల్ ప్లేయర్లతోపాటు దేశవాళీ క్రికెట్ ఆడే ప్లేయర్లతో కలిసి పాల్గొనేదే ఐపీఎల్. వచ్చే ఏడాది ఏప్రిల్ 15 నుంచి 15వ ఐపీఎల్ సీజన్ ప్రారంభం కానున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. భారీగా వేలం ద్వారా ఆటగాళ్లను కొనుగోళ్లకు అవకాశాలు రానున్నాయి. వచ్చే సీజన్లో రెండు ఫ్రాంచైసీలు ఎంటర్ కానున్నాయి. దీంతోపాటు తాజాగా రిటెన్షన్ విధానాన్ని తీసుకొచ్చింది.
మిస్టర్ కూల్, చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) సారధి ఎంఎస్ ధోనీని తిరిగి సీఎస్కే ఎంచుకుంది. అయితే రవీంద్ర జడేజాను తొలుత ఎంచుకున్న సీఎస్కే, రెండో క్రికెటర్గా ధోనీని ఎంచుకోవడం గమనార్హం. మిస్టర్కూల్కు అత్యంత సన్నిహితుడిగా ఉండే సురేశ్ రైనాను మాత్రం తీసుకోలేదు. అయితే ఫాప్ డుప్లెసిస్, అంబటి రాయుడు, దీపక్ చాహార్, శార్దూల్ ఠాకూర్, సురేశ్ రైనాను వేలంలో తీసుకునే అవకాశాలు ఉన్నాయి. రవీంద్ర జడేజాకు రూ.16 కోట్లు, ఎంఎస్ ధోనీకి రూ.12 కోట్లు, మోయిన్ అలీకి రూ.8 కోట్లు, రుతురాజ్ గైక్వాడ్ రూ.6 కోట్లు పలికారు.
జట్టులో మ్యాచ్ విన్నర్స్ చాలా మంది ఉన్నా.. ఇప్పటి వరకు టైటిల్ గెలుచుకోని జట్టేదైనా ఉందంటే అది. రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ (ఆర్సీబీ). ఈ జట్టు తిరిగి ప్రాంచైసీ మాజీ కెప్టెన్, టీం ఇండియా సారధి విరాట్ కోహ్లీతోపాటు మాక్స్వెల్, సిరాజ్లను ఎంచుకుంది. విరాట్ కోహ్లీ రూ.15 కోట్లు, గ్లెన్ మాక్స్వెల్ రూ.11 కోట్లు, మహ్మద్ సిరాజ్ రూ.7 కోట్లకు గెలుచుకుంది. దేవదుత్పడిక్కల్, యుజేంద్ర చాహల్లను దక్కించుకుంది. ఏబీ డివిలియర్స్ అసలు ఆటకే వీడ్కోలు పలికారు. డేవిడ్ వార్నర్ను గెలుచుకుని రాయల్ చాలెంజర్స్ ఆఫ్ బెంగళూర్.. సారధిగా నియమించుకునే అవకాశం ఉంది.
ఢిల్లీ క్యాపిటల్స్ రిషబ్ పంత్ను రూ.16 కోట్లు, యాక్సర్ పటేల్ను రూ.12 కోట్లు, పృథ్వీ షాను రూ.9.5 కోట్లకు, అనిరిచ్ నోర్జీని రూ.7.5 కోట్లకు సొంతం చేసుకుంది. టీం మాజీ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ను వదులుకుంది. తిరిగి రిషబ్ పంత్ను సారధిగా నియమించుకునే అవకాశాలు ఉన్నాయి. శ్రేయాస్ అయ్యర్.. కొత్త ఫ్రాంచైసీ అహ్మదాబాద్కు వెళ్లే చాన్స్ కనిపిస్తున్నది. సీనియర్ బ్యాట్స్మెన్ శిఖార్ ధావన్ను ఎంచుకుంటుందా?లేదా చూడాలి.
పంజాబ్ కింగ్ ఎలెవెన్ జట్టు ఇద్దరు ప్లేయర్లను రిటైన్ చేసుకుంది. అన్క్యాప్డ్ ప్లేయర్ అర్ష్దీప్ సింగ్ రూ.4 కోట్లు, మయాంక్ అగర్వాల్ రూ.14 కోట్లకు గెలుచుకుంది. కేఎల్ రాహుల్ను వదిలేసుకుంది. వ్యక్తిగతంగా రాణించినా.. జట్టు సారధిగా విఫలం అయ్యాడని మేనేజ్మెంట్ భావించినట్లు తెలుస్తున్నది.
ఐపీఎల్ ప్రారంభంలో దూకుడుగా ఆడిన రాజస్థాన్ రాయల్స్ ప్లేయర్లు తర్వాత దారుణంగా విఫలమయ్యారు. మూడు సార్లు అంటే 2013, 2015, 2018ల్లో మాత్రమే ఫ్లేఆఫ్కు వెళ్లిందీ జట్టు.సంజూ శ్యామ్సన్ సారధ్యంలో ఈ సారి చివరి నుంచి రెండోస్థానానికి పరిమితమైంది. వచ్చే సీజన్కు శ్యామ్సన్తోపాటు బట్ట్లర్ను ఎంచుకున్నది. కోల్కతా నైట్ రైడర్స్ మాత్రం ఆండ్రీ రస్సెల్, వరుణ్ చక్రవర్తి, వెంకటేశ్ అయ్యర్, సునిల్ నారాయణ్ను ఎంచుకున్నది. ఇయాన్ మోర్గాన్ను వేలంలో గెలుచుకుని సారధ్యం అప్పగించే అవకాశాలు ఉన్నాయి.
సన్రైజర్స్ హైదరాబాద్ టీంలో బిగ్ సర్ప్రైజ్లు చోటు చేసుకున్నాయి. ఇద్దరు అన్క్యాప్డ్ ప్లేయర్లతోపాటు ముగ్గురు ఆటగాళ్లను తిరిగి సొంతం చేసుకుంది. కన్నె విలియమ్సన్, అబ్దుల్ సమద్, ఉమ్రాన్ మాలిక్.. సన్రైజర్స్ హైదరాబాద్ సొంతం చేసుకున్న క్రికెటర్లు. ముంబై ఇండియన్స్ (ఎంఐ) నలుగురు ప్లేయర్లను గెలుచుకుంది. కెప్టెన్ రోహిత్ శర్మతోపాటు జస్ప్రీత్ బుమ్రా, కెరోన్ పొల్లార్డ్, సూర్యకుమార్ యాదవ్ వారిలో ఉన్నారు.