న్యూఢిల్లీ: తాను చనిపోలేదని, సజీవంగానే ఉన్నట్లు జింబాబ్వే మాజీ క్రికెటర్ హీత్ స్ట్రీక్(Heath Streak) ప్రకటించారు. మాజీ కెప్టెన్ హీత్ స్ట్రీక్ మరణించినట్లు ఇవాళ ఉదయం తోటి క్రికెటర్ హెన్రీ ఓలాంగో ఓ ట్వీట్ చేశారు. ఆ వార్త శరవేగంగా వ్యాపించింది. దీనిపై హీత్ స్ట్రీక్ క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది. తాను మరణించినట్లు వచ్చిన వార్త తనను బాధించినట్లు స్ట్రీక్ వెల్లడించాడు. స్ట్రీక్ స్వయంగా ఓ మీడియా సంస్థతో మాట్లాడారని, తాను ప్రాణాలతోనే ఉన్నట్లు ఆ సంస్థతో పేర్కొన్నట్లు తెలుస్తోంది. తన చావుపై వచ్చిన వార్త రూమర్ అని, అదో అబద్ధం అన్నారు. ఎటువంటి నిర్ధారణ లేకుండా ఎలా ఒకరి చావు వార్తను వ్యాప్తి చేస్తారని హీత్ ప్రశ్నించినట్లు తెలుస్తోంది. తన చావు వార్తను వ్యాప్తి చేసిన వ్యక్తి క్షమాపణ చెప్పాలన్నారు. ఆ వార్త తనను ఎంతో బాధించినట్లు స్ట్రీక్ వెల్లడించారు. హీత్ స్ట్రీక్ మరణవార్తను పోస్టు చేసిన ఓలాంగో.. మళ్లీ కొత్త ట్వీట్ చేశారు. థార్డ్ అంపైర్ అతన్ని వెనక్కి రమ్మన్నట్లు తెలిసిందని కామెంట్ చేశారు.
I can confirm that rumours of the demise of Heath Streak have been greatly exaggerated. I just heard from him. The third umpire has called him back. He is very much alive folks. pic.twitter.com/LQs6bcjWSB
— Henry Olonga (@henryolonga) August 23, 2023